21 అప్పటినుండి యేసు, తాను యెరూషలేముకు వెళ్లాలని, తాను పెద్దల, ముఖ్య యాజకుల, శాస్త్రుల చేతుల్లో ఎన్నో బాధలు అనుభవించి చంపబడాలని, మూడో రోజున బ్రతికించబడాలని తన శిష్యులకు చెప్పడం మొదలుపెట్టాడు.+
22 వాళ్లు గలిలయలో కలుసుకున్నప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు,+23 వాళ్లు ఆయన్ని చంపుతారు, కానీ మూడో రోజున ఆయన బ్రతికించబడతాడు.”+ అది విని వాళ్లు చాలా దుఃఖపడ్డారు.
31 అంతేకాదు, మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలని; పెద్దల చేత, ముఖ్య యాజకుల చేత, శాస్త్రుల చేత తిరస్కరించబడి చంపబడతాడని;+ మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతుకుతాడని బోధించడం మొదలుపెట్టాడు.+
44 “ఈ మాటలు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. మానవ కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు.”+45 కానీ ఆయన ఏం చెప్తున్నాడో వాళ్లకు అర్థంకాలేదు. నిజానికి వాళ్లు అర్థం చేసుకోకుండా ఉండేలా అది దాచబడి ఉంది. పైగా ఆ మాట గురించి ఆయన్ని ప్రశ్నించడానికి వాళ్లు భయపడ్డారు.