-
సమాధానకర్తయగు అధిపతి గురించి వాగ్దానంయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
15, 16. (ఎ) “జెబూలూను నఫ్తాలి యను దేశముల” పరిస్థితి ఏ “అంత్యకాలమున” మారుతుంది? (బి) అవమానపరచబడిన దేశం ఎలా మహిమపరచబడుతుంది?
15 యేసు భూపరిచర్యను గూర్చిన ప్రేరేపిత వృత్తాంతంలో అపొస్తలుడైన మత్తయి ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. ఆ పరిచర్య తొలి దినాలను వర్ణిస్తూ, మత్తయి ఇలా చెబుతున్నాడు: “[యేసు] నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.—జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)”—మత్తయి 4:12-16.
-
-
సమాధానకర్తయగు అధిపతి గురించి వాగ్దానంయెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
“గొప్ప వెలుగు”
17. గలిలయలో ఒక “గొప్ప వెలుగు” ఎలా ప్రకాశించింది?
17 మత్తయి గలిలయలో “గొప్ప వెలుగు” గురించి ప్రస్తావించిన దాని విషయమేమిటి? ఇది కూడా యెషయా ప్రవచనంలో నుండే ఎత్తిచెప్పబడింది. యెషయా ఇలా వ్రాశాడు: “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును.” (యెషయా 9:2) సా.శ. మొదటి శతాబ్దానికల్లా, సత్యపు వెలుగు అన్యమత అబద్ధాలతో మరుగు చేయబడింది. యూదా మతనాయకులు తమ మతాచారాలను అంటిపెట్టుకుని ఉండి “దేవుని వాక్యమును నిరర్థకము” చేస్తూ సమస్యను మరింత జటిలం చేశారు. (మత్తయి 15:6) వినయంగలవారు “అంధులైన మార్గదర్శకుల”ను అనుసరిస్తూ అణిచివేయబడ్డారు, అయోమయంలో పడిపోయారు. (మత్తయి 23:2-4, 16) మెస్సీయ అయిన యేసు వచ్చినప్పుడు, వినయంగల అనేకమంది కళ్లు అద్భుతరీతిగా తెరువబడ్డాయి. (యోహాను 1:9, 12) యేసు ఈ భూమిపైనున్నప్పుడు చేసిన పని, ఆయన బలి ఫలితంగా వచ్చే ఆశీర్వాదాలు, యెషయా ప్రవచనంలో “గొప్ప వెలుగు” అని సరిగానే వర్ణించబడ్డాయి.—యోహాను 8:12.
-