-
ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఉంటారుకావలికోట—1999 | మే 1
-
-
“దేవుని కుమారుల ప్రత్యక్షత”
“దేవుని కుమారుల” కార్యశీలత ద్వారా ఒకరోజు మానవ కుటుంబానికి స్వాతంత్ర్యం పునరుద్ధరించబడుతుంది అన్న “నిరీక్షణ” ఆధారంగానే యెహోవా సృష్టిని వ్యర్థత్వానికి అప్పగించాడు. ఈ ‘దేవుని కుమారులు’ ఎవరు? వారు యేసుక్రీస్తు శిష్యులు, మిగతా “[మానవ] సృష్టి” లాగే పాపమూ అపరిపూర్ణతల దాస్యంలో జన్మించినవారే. వారికి దేవుని స్వచ్ఛమైన, పరిపూర్ణమైన విశ్వ కుటుంబంలో వారసత్వంగా లభించిన స్థానమేదీ లేదు. కానీ యెహోవా వారి కోసం అసాధారణమైనదొకటి చేశాడు. యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా ఆయన వారిని వారసత్వంగా పొందిన పాపపు దాస్యం నుండి విముక్తుల్ని చేసి, వారిని “నీతిమంతులుగా” లేక, ఆధ్యాత్మికంగా కడగబడినవారిగా ప్రకటిస్తాడు. (1 కొరింథీయులు 6:11) అటుతర్వాత ఆయన వారిని తన విశ్వ కుటుంబంలోనికి తిరిగి తీసుకుంటూ వారిని ‘దేవుని కుమారులు’గా దత్తత తీసుకుంటాడు.—రోమీయులు 8:14-17.
యెహోవా దత్తత తీసుకున్న కుమారులుగా, వారికి మహిమకరమైన ఆధిక్యత లభిస్తుంది. వారు ‘దేవునికి యాజకులుగాను, భూలోకమందు ఏలుటకుగాను’ యేసుక్రీస్తు ప్రక్కన దేవుని పరలోక రాజ్యంలో అంటే పరలోక ప్రభుత్వంలో భాగంగా ఉంటారు. (ప్రకటన 5:9, 10; 14:1-4) ఇది స్వాతంత్ర్యం, న్యాయం అనే సూత్రాలపై స్థాపించిన ప్రభుత్వం—అణచివేత, నిరంకుశత్వములపై ఆధారపడినది కాదు. (యెషయా 9:6, 7; 61:1-4) ఈ దేవుని కుమారులు ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన ‘అబ్రాహాము సంతానం’ అయిన యేసుకు సహకారులుగా ఉంటారని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. (గలతీయులు 3:16, 26, 29) ఆ హోదాలో వారు దేవుడు తన స్నేహితుడైన అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తారు. అబ్రాహాము సంతానం ద్వారా “భూలోకములోని జనములన్నియు . . . ఆశీర్వదించబడును” అన్నది ఆ వాగ్దానంలో ఒక భాగం.—ఆదికాండము 22:18.
-
-
ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఉంటారుకావలికోట—1999 | మే 1
-
-
“దేవుని కుమారుల ప్రత్యక్షత” ఎప్పుడు ప్రారంభమౌతుంది? చాలా త్వరలోనే, దేవుని కుమారులు ఎవరన్నది యెహోవా అందరికీ స్పష్టపర్చినప్పుడే ప్రారంభమౌతుంది. ఈ స్పష్టపర్చడం ఎప్పుడు జరుగుతుందంటే, ఆ “కుమారులు” ఆత్మ సామ్రాజ్యంలోనికి పునరుత్థానం చేయబడి, దేవుని యుద్ధమైన అర్మగిద్దోనులో భూమ్మీద నుండి దుష్టత్వాన్నీ అణచివేతనూ తీసివేయడంలో యేసుక్రీస్తుతోపాటు భాగం వహించినప్పుడు సంభవిస్తుంది. (దానియేలు 2:44; 7:13, 14, 27; ప్రకటన 2:26, 27; 16:15; 17:14; 19:11-21) తిరుగుబాటునీ, దాని మూలంగా వచ్చిన దుష్టత్వాన్నీ ఎంతో కాలంగా సహిస్తూ వచ్చిన దేవుని సహనం అంతం అయ్యే ఈ “అంత్యదినములలో” మనం చివరికంటా వచ్చేశామనడానికి రోజురోజుకీ అధికమౌతున్న సాక్ష్యాధారాల్ని మన చుట్టూ చూస్తున్నాము.—2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-31.
-
-
ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఉంటారుకావలికోట—1999 | మే 1
-
-
మీరు ‘దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు . . . తేరిచూచుచు కనిపెడుతుండగా,’ అపొస్తలుడైన పౌలు తాను పడే బాధలు, అనుభవించే అన్యాయాలు ఇక భరించలేనని అన్పించినప్పటికీ, క్రీస్తు చూపించే సంరక్షణాత్మకమైన శ్రద్ధమీద అందించే మద్దతుమీద ఆయన ఉంచినటువంటి నమ్మకాన్ని మీరు కూడా పెంపొందించుకోవచ్చు. దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి చర్చించిన తర్వాత పౌలు, “క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?” అని అడిగాడు. (రోమీయులు 8:35) అవును, పౌలు కాలంలోని క్రైస్తవులు, రూసో మాటల్లో చెప్పాలంటే అప్పటికింకా ఏదో ఒక రకమైన అణచివేసే “సంకెళ్ళలోనే” ఉన్నారు. వారు “వధకు సిద్ధమైన గొఱ్ఱెల” వలె ‘దినమెల్ల వధింపబడినవారే.’ (రోమీయులు 8:36) ఆ అణచివేత తమను ఓడించేందుకు అనుమతించారా?
-