-
ప్రభువురాత్రి భోజనం—దానిని ఎంత తరచుగా ఆచరించాలి?కావలికోట—1994 | మార్చి 15
-
-
యేసు ఈ ఆచరణను ప్రారంభించి, యూదుల క్యాలెండరు ప్రకారం నీసాను 14వ తేదీన మరణించాడన్నది కూడా జ్ఞాపకముంచుకోండి.a సా.శ.పూ. 16వ శతాబ్దంలో ఐగుప్తు నందు యూదులు అనుభవించిన గొప్ప విడుదలను జ్ఞాపకం చేసే పండుగే ఈ పస్కా దినం. ఆనాడు, గొర్రెపిల్ల బలి యూదుల మొదటి సంతానానికి రక్షణ కాగా, ఐగుప్తులోని మొదటి సంతానాన్ని యెహోవా దూత హతమార్చాడు.—నిర్గమకాండము 12:21, 24-27.
ఇది మన గ్రహణ శక్తికి ఎలా తోడ్పడుతుంది? క్రైస్తవ అపొస్తలుడై పౌలు యిలా రాశాడు: “యేసు అను మన పస్కా పశువు వధింపబడెను.” (1 కొరింథీయులు 5:7) యేసు మరణం, మానవజాతి ఎంతో గొప్ప రక్షణనుపొందే అవకాశాన్నిస్తూ మరి గొప్ప పస్కా బలిగా ఉండెను. కాబట్టి క్రైస్తవులకు, యూదుల పస్కా స్థానే క్రీస్తు మరణదిన జ్ఞాపకార్థం వచ్చింది.—యోహాను 3:16.
పస్కా సాంవత్సరిక ఆచరణగా ఉండేది. కనుక సహేతుకంగా, జ్ఞాపకార్థదినం కూడా అంతే అవుతుంది. యేసు మరణించిన ఆ పస్కా దినం, అన్ని సమయాల్లో యూదుల నెలైన నీసాను 14వ రోజున వచ్చేది. కాబట్టి, మన క్యాలెండరులో నీసాను 14కు సరిగ్గా సరిపడే దినాన, అదీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యేసు మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు 1994లో మార్చి 26 శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత వస్తుంది. అయితే, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు దీనిని ఒక ప్రత్యేక ఆచరణ దినంగా ఎందుకు చేయలేదు? చరిత్రను క్లుప్తంగా పరిశీలించడం ఈ ప్రశ్నకు జవాబునిస్తుంది.
-
-
ప్రభువురాత్రి భోజనం—దానిని ఎంత తరచుగా ఆచరించాలి?కావలికోట—1994 | మార్చి 15
-
-
a యూదుల మొదటి నెలైన నీసాను, పున్నమి చంద్రుడు మొట్టమొదటిసారిగా కనిపించినప్పుడు ప్రారంభమౌతుంది. కాబట్టి నీసాను 14 పున్నమి చంద్రుడున్న నాడే ఎల్లప్పుడూ వస్తుంది.
-