-
రోమీయులు 3:20-22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
20 కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఏ ఒక్కరూ దేవుని ఎదుట నీతిమంతులని తీర్పు పొందరు.+ ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల, పాపం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.+
21 అయితే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించకుండానే దేవుని దృష్టిలో నీతియుక్తమైన స్థానం పొందవచ్చనే విషయం వెల్లడిచేయబడింది.*+ ఇదే విషయం ధర్మశాస్త్రంలో, అలాగే ప్రవక్తల పుస్తకాల్లో కూడా రాసివుంది.+ 22 అవును, విశ్వాసంగల వాళ్లందరూ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని దృష్టిలో నీతియుక్తమైన స్థానం పొందవచ్చు. దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే.
-